
82 అడుగులకు చేరిన భవానీసాగర్
సేలం : భవానీసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 82 అడుగులు దాటింది. 105 అడుగులు నీటి నిల్వ సా మర్థ్యం కలిగిన భవానీసాగర్ ఆనకట్టకు నీలగిరి ప ర్వతాల్లో అధిక వర్షం కురిస్తే వరదలు పొటెత్తుతాయి. కొన్ని రోజులుగా నీలగిరి పరిసరాల్లో విస్తారంగా వ ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం నాటికి భవానీసాగర్ నీటి మట్టం 82.13 అడుగులకు చేరింది. రిజర్వా యర్లోకి 2,423 క్యూబిక్ల నీరు వచ్చి చేరుతోంది. 755 క్యూబిక్ అడుగుల నీటిని బయటకు విడుదల చే స్తున్నారు. ఇందులో భవానీ నదిలోకి తాగునీటి కోసం 150 క్యూబిక్ అడుగుల నీరు, తాడపల్లి–అరక్కన్ కొట్టై నీటిపారుదల కోసం 600 క్యూబిక్ నీరు, దిగువ భవానీ కాలువ నీటిపారుదల కోసం 5 క్యూబిక్ల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇతర రిజర్వాయర్లలో కూడా నీటిమట్టం పెరుగుతోంది. కుందేరి పల్లం రిజర్వాయర్ నీటి మట్టం 25.81 అడుగులకు చేరింది. వరట్టుపల్లంట నీటి మట్టం 24.70 అడుగులు, పెరుంపల్లం రిజర్వాయర్ నీటిమట్టం 16.12 అడుగులకు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవానీ సాగర్