తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు

Apr 30 2025 12:25 AM | Updated on Apr 30 2025 12:25 AM

తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు

తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు

● గొంతుపై కాలుతో తొక్కి తల్లి హత్య

సేలం: తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో తల్లి గొంతుపై కాలుతో తొక్కి చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కుంభకోణం సమీపంలోని ఆడుతురై గార్డెన్‌ సిటీకి చెందిన వ్యక్తి స్టాలిన్‌(47). ఆయన భార్య బృంద (40). వీరి కుమారులు అరుణ్‌కుమార్‌(18), అన్బుకరసన్‌(15). కూతురు ఐశ్వర్య(10) ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా స్టాలిన్‌, అతని భార్య బృంద గత కొన్ని సంవత్సరాలుగా వారి మధ్య విభేదాలు ఎదుర్కొంటున్నారు. దీని తరువాత బృంద తన కుమార్తె ఐశ్వర్యను కుత్తలం సమీపంలోని అంజరు వార్తలైలో నివశించే తన తల్లి ఇంటికి తీసుకెళ్లింది. ఇద్దరు కుమారులు తమ తండ్రితో ఉన్నారు. స్టాలిన్‌ నాలుగు సంవత్సరాల క్రితం తిరునాగేశ్వరానికి చెందిన ఉమా మహేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బిడ్డ ఉంది. ఈ స్థితిలో స్టాలిన్‌ గత సంవత్సరం అనారోగ్యంతో మరణించాడు. స్టాలిన్‌ మరణం తర్వాత బృందా తన కుమారులతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. స్టాలిన్‌ రెండవ భార్య ఉమా మహేశ్వరి తన జన్మస్థలం తిరునాగేశ్వరానికి వెళ్లిపోయిందని సమాచారం. నాలుగు రోజుల క్రితం, బృంద తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి ఆడుదురైలోని ఎస్‌ఎంఎస్‌ నగర్‌లోని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు ఆమె పెద్ద కొడుకు అరుణ్‌కుమార్‌ ఇంత చిన్న వయసులోనే ఎందుకు వదిలేశావు, ఇప్పుడు ఎందుకు వచ్చావని వాగ్వాదం చేశాడు. తీవ్ర ఆవేశానికి గురైన అరుణ్‌కుమార్‌ తల్లిని కిందికి తోసి, మెడపై కాలు పెట్టి తొక్కాడు. దీంతో బృంద సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న తిరువిడైమరుదూర్‌ పోలీస్‌ డీఎస్పీ రాజు, ఇన్‌స్పెక్టర్‌ రాజా, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. బృంద మృతదేహాన్ని కుంభకోణం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు అరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement