
సుధా కొంగర దర్శకత్వంలో శింబు
తమిళసినిమా: సంచలన నటుడు శింబు చిత్రాల కోసం ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన నటించిన చిత్రం పత్తుతల 2023లో విడుదలైంది. అదీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా శింబు వరుసగా చిత్రాలను కమిట్ అవుతుండడం విశేషం. ఈయన తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తన 49వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ తరువాత దేసింగు పేరియసామి దర్శకత్వంలో తన 50వ చిత్రాన్ని చేయడానికి కమిట్ అయ్యారు. అదే విధంగా డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో తన 51వ చిత్రంలో నటించనున్నారు. ఇలా మూడు చిత్రాల్లో నటించడానికి కమిట్ అయిన శింబు కోసం మరిన్ని నూతన చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి సుధా కొంగర దర్శకత్వం వహించే చిత్రం ఒకటి. ఇరుదు చుట్రు చిత్రంతో సూపర్హిట్ కొట్టి తమిళసినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర. ఆ తరువాత సూరరై పోట్రు వంటి మరో విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఈమె ప్రస్తుతం నటుడు శివకార్తీకేయన్ హీరోగా పరాశక్తి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మోహన్ రవి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల నాయకిగా పరిచయం అవుతున్నారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు తాజాగా శింబును డైరెక్టర్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని వైట్టైనాయ్ అనే నవల ఆధారంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సంచలన చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. అదే విధంగా నటుడు శింబు దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

సుధా కొంగర దర్శకత్వంలో శింబు