
నావిగేషన్ వ్యవస్థతో ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలు
సాక్షి, చైన్నె : అధునాతన మెదడు, వెన్నెముక, ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల కోసం అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థతో కూడిన ఓ–ఏఆర్ఎం సర్జికల్ సిస్టమ్ను చైన్నెలో ప్రపథమంగా పరిచయం చేశారు. ఈ విధానాన్ని చైన్నెలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ ప్రారంభించారు. కావేరి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కు చెందిన ఆళ్వార్ పేట ఆస్పత్రిలో ఈ అధునాతన వ్యవస్థను ఏఐ ఆధారిత 2డీ, 3డీ ఇమేజింగ్ ద్వారా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఓ ఆర్మ్ వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైన మెదడు, వెన్నెముక, ఆర్థోపెడిక్ విధానాలను ఖచ్చితత్వం, భద్రతతో నిర్వహిస్తూ సర్జన్లకు సహకారంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కావేరి ఆస్పత్రి కో ఫౌండర్ అరవిందన్ సెల్వరాజ్, న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రంఘనాథన్ జ్యోతి, బ్రెయిన్ అండ్ స్పైన్ డైరెక్టర్ డాక్టర్ క్రిష్ శ్రీధర్, వెన్నెముక శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ బాల మురళి, న్యూరో సర్జన్ డాక్టర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.