
పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
వేలూరు: కాట్పాడిలో పరిశ్రమల స్థాపనకు వ్యాపారులు ముందుకురావాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడి గాంధీనగర్లో పద్మని పవర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎండీ కలైఅరసన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి హాజరైన శంకర్ విశ్వనాథన్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ యుక్త వయస్సులోనే ప్రజలకు సేవ చేయడానికి ముందకు రావడం అభినందనీయమన్నారు. సన్బీమ్ పాఠశాల చైర్మన్ డాక్టర్ హరిగోపాలన్, కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత, కాట్పాడి జూనియర్ రెడ్క్రాస్ సంఘం ఉపాధ్యక్షుఉ శ్రీనివాసన్, పారిశ్రామిక వేత్తలు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.