
నకిలీ డాక్యుమెంట్లతో రెండు కోట్లు విలువ చేసే భూమి విక్ర
తిరువళ్లూరు: నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి సుమారు రెండు కోట్లుకు విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు, న్యాయవాదులు మంగళవారం ఉదయం ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ శిరువానూర్ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన సుమారు రెండు కోట్లు రూపాయలు విలువ చేసే భూమి ఉంది. సంబందిత భూమిని అదే గ్రామానికి చెందిన సంతోష్కమార్, బాలాజీ, చిన్నదురై, నటరాజర్, నరేష్, పార్థీబన్ తదితరులు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, కలెక్టర్ ప్రతాప్కు వినతిపత్రం సమర్పించారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.