కల్తీ సారా కేసులో ఇద్దరికి బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

కల్తీ సారా కేసులో ఇద్దరికి బెయిల్‌

Apr 23 2025 7:52 AM | Updated on Apr 23 2025 8:39 AM

కల్తీ సారా కేసులో ఇద్దరికి బెయిల్‌

కల్తీ సారా కేసులో ఇద్దరికి బెయిల్‌

సేలం: కళ్లకురిచ్చి జిల్లాలోని కరుణాపురం ప్రాంతంలో గత ఏడాది జూన్‌లో కల్తీ సారా తాగి దాదాపు 69 మంది మరణించారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాజకీయ పార్టీల నుండి ఖండనలు వెలువడిన నేపథ్యంలో, నకిలీ మద్యం అమ్మకాలతో సంబంధం ఉన్న అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం అమ్మకం, అక్రమ రవాణా తదితర అభియోగాలపై మొత్తం 21 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని వివిధ ప్రదేశాలలో నకిలీ మద్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉంది. దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించబడుతున్న కన్నుకుట్టి అలియాస్‌ గోవిందరాజ్‌, కన్నుకుట్టి భార్య విజయ, కన్నుకుట్టి సోదరుడు దామోదరన్‌, పరమశివంలను జైలుకు పంపారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా కన్నకుట్టి, దామోదరన్‌ బెయిల్‌ కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో సీబీఐ డిఫెన్స్‌ వాదనలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా పరిగణించబడుతున్న కన్నకుట్టి, దామోదరన్‌లకు బెయిల్‌ మంజూరు చేయకూడదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు కన్నకుట్టి, దామోదరన్‌ ఇద్దరికీ బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇద్దరూ దర్యాప్తు అధికారి ముందు ప్రతిరోజూ హాజరు కావాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement