నీట్‌కు 859 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

నీట్‌కు 859 మంది హాజరు

May 5 2025 8:30 AM | Updated on May 5 2025 8:30 AM

నీట్‌

నీట్‌కు 859 మంది హాజరు

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట జిల్లాలో నీట్‌–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం నాలుగు సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. నాలుగు సెంటర్లలో మొత్తం 890 మంది విద్యార్థులకు గాను 859 మంది హాజరు కాగా 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకేంద్రాలను కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌ తనిఖీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఎస్పీ నరసింహ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు.

నీట్‌కు 859 మంది హాజరు1
1/1

నీట్‌కు 859 మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement