కేసీఆర్‌ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు

Apr 29 2025 9:47 AM | Updated on Apr 29 2025 9:47 AM

కేసీఆర్‌ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు

కేసీఆర్‌ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు

నకిరేకల్‌: వరంగల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్‌ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మంత్రులు పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్‌ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీపై, కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్‌ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్‌ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్‌ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్‌, రాచకొండ వెంకన్నగౌడ్‌, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్‌, వంటల చేతన్‌, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement