
ఏడాదైనా 20శాతం పనులే..
సూర్యాపేట పట్టణంలో నత్తనడకన యూజీడీ నిర్మాణం
దోమలు వృద్ధిచెందాయి
రోడ్ల పక్కనే మురుగు కాల్వలు ఉండడంతో దుర్వాసన వస్తోంది. దోమలు వృద్ధిచెందుతున్నాయి. యూజీడీ ఏర్పాటు చేయడం సంతోషకరం. కానీ నెలల తరబడి పనులు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– చిత్తలూరి నరేష్, శ్రీనివాస కాలనీ
నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తాం
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఇప్పటికీ 20శాతం మేర పూర్తయ్యాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తాం. అన్ని వార్డుల్లో పైప్లైన్ వేసిన తర్వాత మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తాం.
– నరేందర్, ఏఈ
ఫ రూ.316 కోట్లతో పనులకు శ్రీకారం
ఫ మొదటి జోన్లో కొనసాగుతున్నా..
రెండో జోన్లో మొదలు కాలే..
ఫ డిజైన్ రూపకల్పనలో జాప్యం..
బిల్లులు అందక ఆలస్యం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డిజైన్ సర్వే చేయడంలో జాప్యం.. కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు అందకపోవడం.. వెరసి రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది దాటినా 20శాతం మాత్రమే పూర్తయ్యాయి.
2024 మార్చిలో ప్రారంభించినా..
సూర్యాపేట పట్టణంలో సుమారు రూ.316కోట్ల అంచనా వ్యయంతో 290 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇంటి నుంచి మెయిన్పైప్లైన్కు ఎనిమిది ఈంచుల వ్యాసం గలపైపులు, మెయిన్లైన్ కోసం ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రెండు నుంచి మూడు ఈంచుల వ్యాసం గల పైపులు వేయాలని నిర్ణయించారు. యూజీడీ పనుల కోసం పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. పనులకు 2023లో శంకుస్థాపన చేయగా 2024 మార్చిలో ప్రారంభించారు.
మొదటి జోన్లో..
మొదటి జోన్లో భగత్సింగ్నగర్, జమ్మిగడ్డ, చింతలచెరువు, తిరుమలనగర్, చర్చికాంపౌండ్, అంబేద్కర్ నగర్, పాత ఎమ్మార్వో ఆఫీస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పైపులు వేసి వీటిని జమ్మిగడ్డలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన తర్వాత పుల్లారెడ్డి చెరువులోకి తరలించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ జోన్లో పనులు ప్రారంభమయ్యాయి. చర్చికాంపాండ్, బాలాజీ నగర్, భగత్సింగ్నగర్, అంబేద్కర్నగర్లో మొయిన్ పైప్లైన్ వేసే పనులు పూర్తయ్యాయి. ఇళ్ల నుంచి మెయిన్ పైప్లైన్కు పైపులు వేయలేదు. మిగతా చోట్ల మెయిన్పైప్లైన్ వేసే పనులు సాగుతున్నాయి.
రెండో జోన్లో ఇలా..
రెండో జోన్ లో 9, 23, 24,25,29, 39, 40,41 42 వార్డుల్లో యూజీడీ పైపులు వేసి ఆ మురుగునీటిని నల్లచెరువు వద్ద నిర్మిస్తున్న ముగురునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నల్లచెరువులోకి తరలిస్తారు. కానీ ఈ జోన్లో పనులే మొదలు కాలేదు. ఇందిరమ్మ ఫేస్–1, ఫేస్2, ఫేస్–3, శ్రీనివాస కాలనీ, రాజీవ్నగర్ ప్రాంతాల్లో మెయిన్ పైప్లైన్ వేయడానికి మార్కింగ్ వేసి వదిలేశారు.
బిల్లులు రాక..
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ డిజైన్ రూపకల్పనలో ఆలస్యం కారణంగా పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. దీనికితోడు కాంట్రాక్టర్కు గతంలో సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి.
ప్రజలకు తప్పని ఇబ్బందులు
బాలాజీ నగర్, శ్రీరాంనగర్, కాశీంపేట ప్రాంతాల్లో రోడ్డును తవ్వి మెయిన్పైస్ లైన్ వేసి పూడ్చారు కానీ రోడ్డును చదును చేయకపోవడంతో గుంతలుగుంతలుగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి
ఇందిరమ్మ ఫేస్–1 కాలనీలో ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. రోడ్డు మధ్యలో డ్రిల్లింగ్ మిషన్లతో రంధ్రాలు చేసి వదిలేశారు. చీకట్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేయాలి.
– యాతాకుల రాజయ్య, ఇందిరమ్మ కాలనీ
సూర్యాపేట పట్టణంలో వార్డులు 48
నివాస గృహాలు 39,800
జనాభా 1.53 లక్షలు
యూజీడీ అంచనా
వ్యయం రూ.316 కోట్లు

ఏడాదైనా 20శాతం పనులే..

ఏడాదైనా 20శాతం పనులే..

ఏడాదైనా 20శాతం పనులే..