జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం

Apr 24 2025 8:31 AM | Updated on Apr 24 2025 8:31 AM

జిల్ల

జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం

భానుపురి (సూర్యాపేట) : క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకులను నియమించింది. సూర్యాపేట జిల్లా పీసీసీ పరిశీలకులుగా డాక్టర్‌ బి.మురళీనాయక్‌, శత్రు బిజ్జిలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధుల మధ్య సమన్వయం కోసం ఈ పరిశీలకులను నియమించారు. వీరు త్వరలో డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్‌, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్‌ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలోని విఽవిధ వర్గాలను సమన్వయం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికలు రూపొందించి అధిష్టానానికి అందజేయనున్నారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవులను ఆశించే వారికి ప్రాధాన్యం ఉంటుందని ఓ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

ఈ– ఫైలింగ్‌పై

దృష్టి సారించాలి

చివ్వెంల(సూర్యాపేట) : ఈ– ఫైలింగ్‌ విధానంపై న్యాయవాదులు దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ విదానం వల్ల పని తక్కువగా ఉంటుందని, మనకు కావాల్సిన కాగితాలు వెంటనే చూసుకోవచ్చన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, సెకండ్‌ క్లాస్‌ మెజిసే్‌ట్రట్‌ బి.వెంకటరమణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

ఎంప్లాయీస్‌ జేఏసీ

జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ప్రవీణ్‌

సూర్యాపేటటౌన్‌ : తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఈయన పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి గా కూడా పనిచేస్తున్నారు.

జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం1
1/1

జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement