
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. పాఠశాలలు జూన్ 12న తెరుచుకోనున్నాయి.
ఫ చివరి రోజు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
ఫ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం