ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా

Apr 24 2025 8:31 AM | Updated on Apr 24 2025 8:31 AM

ఇంటర్

ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా

సూర్యాపేటటౌన్‌: ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటసాయి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తమ హవా కొనసాగించారు. కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్‌ కారింగుల బాలగౌడ్‌ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థిని జి. హాసిని ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)లో 500 మార్కులకు గాను 494 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కంప్యూటర్‌ సైనన్స్‌లో నక్కల కీర్తన 500 మార్కులకు గాను 482, డెయిరీ గ్రూప్‌లో ముండ్ల మౌనిక 500 మార్కులకు గాను 475, ఎంఎల్‌టీ గ్రూప్‌లో ఎం. ఇందు 475, ఫిజియోథెరపీలో అష్మిత 466 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)లో కె.వంశవర్థిని 1000 మార్కులకు గాను 989 మార్కులు, ఎంఎల్‌టీ గ్రూపులో కారింగుల సౌజన్య 981, ఫిజియోథెరపీలో వి. గణేష్‌ 978 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు చైర్మన్‌ కారింగుల విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ స్వాతి, అధ్యాపకులు అభినందించారు.

ఇంటర్‌ ఒకేషనల్‌లో  ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా 
1
1/3

ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా

ఇంటర్‌ ఒకేషనల్‌లో  ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా 
2
2/3

ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా

ఇంటర్‌ ఒకేషనల్‌లో  ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా 
3
3/3

ఇంటర్‌ ఒకేషనల్‌లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement