
క్రీడా శిక్షణకు రంగం సిద్ధం
హుజూర్నగర్: చిన్నారులూ వేసవి సెలవుల్లో మీకు ఇష్టమైన ఆటలు ఆడాలనుకుంటున్నారా.. క్రీడల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ–డీఎస్ఏ) ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
నాలుగు అంశాలు.. పన్నెండు శిబిరాలు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 14 ఏళ్లలోపు పిల్లలకు నాలుగు క్రీడా అంశాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతించారు. ఈ మేరకు ఆయా క్రీడా మైదానాల ఏర్పాటుకు డీఎస్ఏ సిబ్బంది నిమగ్నమయ్యారు.
శిక్షణ శిబిరాలు ఎక్కడెక్కడంటే..
● అథ్లెటిక్స్– పిల్లలమర్రి (సూర్యాపేట మండలం)
● కబడ్డీ– తుంగతుర్తి, చిలుకూరు, నడిగూడెం
● ఖోఖో– కూచిపూడి(కోదాడ మండలం)
యడ్లపల్లి (సూర్యాపేట మండలం)
● వాలీబాల్– టేకుమట్ల(సూర్యాపేట మండలం), అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం మండలం), కొరమబండ, గుడిబండ(కోదాడ మండలం), పాలెఅన్నారం(చిలుకూరు మండలం) మేళ్లచెరువు.
ఫ వేసవి సెలవుల్లో
చిన్నారులకు ప్రత్యేకం
ఫ అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో,
వాలీబాల్లో శిక్షణ
ఫ పన్నెండు చోట్ల శిబిరాలు ఏర్పాటు
ఫ మే 1 నుంచి 31వ తేదీ వరకు
శిక్షణ కార్యక్రమాలు
సద్వినియోగం చేసుకోవాలి
మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. శిబిరాల నిర్వహణకు పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి వచ్చిన దరఖాస్తులు నుండి 12 మందిని ఎంపిక చేశాం. ఉచితంగా క్రీడా పరికరాలు అందించి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. శిక్షణ కాలానికి నిర్వాహకులకు గౌరవ వేతనం ఇస్తాం. ఆసక్తిగల చిన్నారులు శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన క్రీడలో శిక్షణ పొందాలి.
– జి.రాంచందర్రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట

క్రీడా శిక్షణకు రంగం సిద్ధం