రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

Apr 17 2025 1:51 AM | Updated on Apr 17 2025 1:51 AM

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

మద్దిరాల : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని డీఆర్‌డీఓ అప్పారావు సూచించారు. బుధవారం మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల, ముకుందాపురం గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న రైతులు ధాన్యంపై పట్టాలు కప్పుకొని తడవకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం గుమ్మడవెల్లిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో ఏర్పాటు చేసిన పౌల్ట్రీఫాంను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యానారాయణరెడ్డి, ఏపీఓ గుండు వెంకన్న, ఏపీఎం మైసయ్య, ఈసీ చారి, సీసీ రమేష్‌, నాగార్జున్‌రెడ్డి, వీఓఏలు బాలయ్య, సుమన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement