అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం

Jun 9 2025 7:54 AM | Updated on Jun 9 2025 7:54 AM

అదనపు

అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం

హిరమండలం: విద్యుత్‌ చార్జీల్లో తగ్గుదల కోరే వారికి ఆ శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశమిస్తోంది. క్రమబద్ధీకరణ చేయించుకున్న వారికి అదనపు చార్జీల బెడద ఉండదని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కనెక్షన్‌ ఇచ్చే సందర్భంలో కిలో వాట్‌ విద్యుత్‌ వినియోగానికి గృహాలకు రూ.2వేలు, దుకాణాలకు రూ.2500లు వసూలు చేస్తారు. చాలామంది గృహ వినియోగదారులు ఈ మొత్తానికి సంబంధించి తమ వినియోగం 1నుంచి 2కిలోవాట్‌ లోపలే చూపిస్తున్నారు. వినియోగంలో అంతకు రెట్టింపు కేటగిరిలో చేరిపోతున్నారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన వినియోగమైతే చూపించిన దానికంటే ఏకంగా నాలుగింతలు ఉంటోంది.

జరిమానా బెడద ఉండదు

● ఇప్పటివరకు అధిక లోడ్‌ నియంత్రణలో భాగంగా విద్యుత్‌ అధికారులు, సిబ్బంది తరచూ ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేసేవారు. అధిక లోడ్‌ వినియోగిస్తున్న వారిని గుర్తించి రుసుంతో పాటు జరిమానా విధించేవారు.

● జిల్లాలో సుమారు 6.71లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని వినియోగదారుల్లో 50శాతానికి మించి కనెక్షన్‌ తీసుకున్న సమయంలో చూపించిన వినియోగం కంటే అధికంగానే విద్యుత్‌ వాడుతున్నారు.

● గత ఐదేళ్లుగా ప్రతి నెల తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రీడింగులు తనిఖీ చేసి అధిక లోడ్‌ వినియోగిస్తున్న వారికి జరిమానా విధిస్తున్నారు.

● గృహాలు, దుకాణాలకు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో దీపాలు ఇతర గృహోపకరణాల వినియోగాన్ని సగటున అంచనా వేసి లోడ్‌ను కిలోవాట్‌లలో లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు వేస్తారు. అధిక శాతం గృహాలకై తే 1నుంచి 2కిలోవాట్‌లు, దుకాణాలకు 2 నుంచి 3కిలోవాట్‌లకు మాత్రమే అనుమతి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారమే ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు.

● ఇంటిలో అవసరాలు పెరగడం, దుకాణాలకు సంబంధించి వ్యాపార లావాదేవీలు పెరగడం, వాతావరణ పరిస్థితుల వల్ల అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా విద్యుత్‌ వినియోగం ఉంటుంది.

● వినియోగం అంచనాకు మించడంతో నియంత్రికలపై లోడ్‌ ఎక్కువై తరుచూ ట్రిప్‌ కావడం లోఓల్టేజ్‌ సమస్యలు పెరిగిపోతున్నాయి.

● ప్రతి అదనపు కిలోవాట్‌కి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.200 నిర్ణయించారు. ఇదే సమయంలో డెవలప్‌మెంట్‌ చార్జీ రూ.1500 లు ఉంటుంది. కిలోవాట్‌లు పెరిగే కొద్దీ ఈ రుసుం మారుతుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు జూన్‌ 30 తేదితో ముగుస్తుంది. కిలోవాట్‌ చొప్పున డవలప్‌మెంట్‌ చార్జీలలో 50శాతం రాయితీ లభిస్తుంది.

స్వచ్ఛందంగా ముందుకు రావాలి

వినియోగదారులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. ఇలా చేసుకుంటే అదనపు రుసుములు, జరిమానా బెడద ఉండదు.

– జి.శంకర్‌రావు, డీఈఈ విద్యుత్‌ శాఖ, టెక్కలి డివిజనల్‌

జూన్‌ 30తో ముగుస్తున్న దరఖాస్తుల స్వీకరణ

అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటున్న విద్యుత్‌ శాఖాధికారులు

అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం 1
1/1

అదనపు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement