
టోల్గేట్ సమీపంలో ప్రమాదం
భార్యాభర్తలకు గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై మడపాం టోల్గేట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. విశాఖ నుంచి స్వగ్రామం టెక్కలి మండలం సింగమహంతిపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మడపాం టోల్గేట్ వద్ద అదుపు తప్పి లారీకి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో బద్దంకి రామారావు, సుకన్యలకు గాయాలయ్యాయి. టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ఒక లారీ సడన్గా పక్కకు రావడంతో గమనించక వీరు లారీని ఢీకొట్టినట్లు తెలిసిందే. స్పందించిన హైవే అంబులెన్స్ సిబ్బంది అంబటి అప్పన్న తదితరులు క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.