
● 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు
● ఏడాదిగా తిరుగుతున్నా..
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్న యువకుడు విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో స్ట్రక్చర్పై అచేతనంగా పడి ఉన్నాడు. శస్త్ర చికిత్స చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. కానీ ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో రూ.లక్షా 30వేలు చెల్లిస్తేనే ఆపరేషన్, చికిత్స ప్రారంభిస్తామని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యు లు హతాశుతులయ్యారు. వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లారు. దరఖాస్తు చేసుకున్న 39 నిమిషాల్లో ఉచిత శస్త్ర చికిత్సకు అవసరమైన ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ కార్డు మంజూరు కావడంతో ఆ కుటుంబ సభ్యులకు కొండంత అండగా లభించినట్లయ్యింది. 2023 జనవరి 23న జరిగిన ఈ సంఘటనను తలచుకొని ఇప్పటికీ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచివాలయానికి చెందిన వలంటీర్ వర్రి సింహాచలం. ఇదీ ప్రజారోగ్యమే పరమావధిగా సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుకు మచ్చుతునక. – ఇచ్ఛాపురం రూరల్
కనుగులవలస గ్రామానికి చెందిన సీపాన ఆనందరావుకు రెండు కళ్లు కనిపించవు. 2019 నుంచి దివ్యాంగ పింఛన్ అందుకునేవాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు కక్షపూరిత చర్యలకు దిగారు. ఆనందరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు వేశాడన్న కక్షతో 2024 ఆగస్టు నుంచి పింఛన్ నిలిపివేశారు. ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయ అధికారులపై ఒత్తిడి పెంచి పింఛన్ అందకుండా తాత్సారం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో రీ వెరిఫికేషన్ చేస్తామని బాధితుడికి చెప్పగా రిమ్స్ ఆసుపత్రి నుంచి ఆ నెలలోనే వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అందించినా ఫలితం శూన్యం. ఎప్పటికప్పుడు కలెక్టర్ గ్రీవెన్స్సెల్కు వెళ్లి వినతిపత్రాలు అందిస్తునే ఉన్నారు. ఇటీవల కోర్టును సైతం ఆశ్రయించాడు. ఇప్పటికైనా పింఛన్ పునరుద్ధరించాలని కోరుతున్నాడు. ఇదీ చంద్రబాబు ఏడాది పాలన మార్కు. – ఆమదాలవలస
ఎంత తేడా బాబూ!
నాడు క్షణాల్లో
నేడు కక్షలతో..

● 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు

● 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు

● 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు