
మూడో రోజూ కొనసాగిన నిరసన
పుట్టపర్తి అర్బన్: న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా నిరవధిక సమ్మె చేపట్టిన సీహెచ్ఓలు, ఎంఎల్హెచ్పీల మూడో రోజు బుధవారమూ తన ఆందోళనను కొనసాగించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆయుస్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని, 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహాకాలు అందించాలని, ఈపీఎఫ్ పునరుద్దరించాలని, క్లినిక్ అద్దెలు వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డు అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీని , ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఆర్ఎస్కే అసిస్టెంట్ల
హేతుబద్ధీకరణ ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవాకేంద్రాల (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియ మొదలైంది. బుధవారం అనంతపురంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారుల ఆధ్వర్యంలో పంటల విస్తీర్ణం ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టారు. జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, ఉద్యానశాఖ డీడీలు ఫిరోజ్ఖాన్, చంద్రశేఖర్, పట్టుశాఖ జేడీలు పద్మమ్మ, ఆంజనేయులు, ఆయా శాఖల సూపరింటెండెంట్లు, టెక్నికల్ అఽధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 856 ఆర్ఎస్కేలకు సిబ్బంది సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 ఖరీఫ్, 2025 రబీ ఈ–క్రాప్ కింద నమోదైన వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల విస్తీర్ణం ఆధారంగా ప్రాధాన్యత వారీగా కొనసాగిస్తున్న ఈ పక్రియ గురువారం పూర్తి కావచ్చునన్నారు.