
గందరగోళంగా ఉపాధ్యాయుల బదిలీలు
రెండు రోజుల క్రితం కొంత మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. శుక్రవారం రాత్రి అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. అయితే ఈ కౌన్సెలింగ్ శనివారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఎస్జీటీలకు పూర్తిగా ఆఫ్లైన్లోనే కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెబ్ ఆప్షన్లు బాయ్కాట్, డీఈఓ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్జీటీల కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.