వైఎస్సార్‌సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక

Published Wed, Apr 17 2024 12:10 AM

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి - Sakshi

కావలి: పట్టణంలోని 40వ వార్డులో టీడీపీకి చెందిన 20 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. జెండాచెట్టు వీధిలో మాజీ కౌన్సిలర్‌ డేగా రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లా డుతూ ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తేనే కావలి ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లకు అప్పగిస్తే నాశనం చేస్తారని చెప్పారు.

నియోజకవర్గాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజలకు అవసరమైన అన్ని పనులు జరగాలన్నా ఎమ్మెల్యేగా రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ ఖాదర్‌బాషా, షేక్‌ అఫ్రోజ్‌, బి.హజరత్తయ్య, షేక్‌ సలీం, షేక్‌ సుల్తాన్‌ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement