
విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన ప్రభుత్వ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో నిర్మిస్తున్న 30 పడకల ఆస్పత్రి పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పరిశీలించి అధికారులకు ఫోన్చేసి త్వరగా తూకం వేయాలని సూచించారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, పల్లి గంగాధర్, దువ్వాక గంగాధర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక
వేములవాడఅర్బన్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడఅర్బన్ మండలం చింతాల్ఠాణాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్