
న్యాయమూర్తులకు అభినందనల వెల్లువ
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నీరజ, ఫస్ట్ అడిసనల్ జిల్లా జడ్జి పుష్పలతను న్యాయవాదులు, మ్యాక్స్ సొసైటీ నాయకులు కలిశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపెల్లి శ్రీనివాస్రావు, మాక్స్ సొసైటీ చైర్మన్ గోవింద్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఇరుకుల అశ్విన్చంద్ర, డైరెక్టర్లు అనిల్కుమార్, వెంకటరెడ్డి, గుర్రం ఆంజనేయులు, పరశురాములు, శ్రీనివాస్, జ్యోతి, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, సభ్యులు ఉన్నారు.
సీసీ కెమెరాలతో భద్రతపై భరోసా
వేములవాడ: సీసీ కెమెరాలతో భద్రతపై భరోసా కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ నిధులతో వేములవాడలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయన్నారు. వేములవాడలో మోడల్ పోలీస్స్టేషన్ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్, జిల్లా కేంద్రంలో మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని డీఎస్పీ కార్యాలయనికి అప్పగించినట్లు తెలిపారు. వేములవాడ టెంపుల్ టౌన్ కాబట్టి రాత్రి 11.30 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచేలా చూడాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు తదితరులు ఉన్నారు.
నాట్యంతో వ్యక్తిత్వ వికాసం
● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
సిరిసిల్లటౌన్: నాట్యంతో సమగ్ర వ్యక్తిత్వ వికాసం, ధారణ శక్తి పెరుగుతుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో శ్రీబాలత్రిపుర సుందరి నాట్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా నాట్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు కింకిణి ధారణ మహోత్సవం(గజ్జ పూజ) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎస్పీ మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా కూచిపూడి నాట్యం నేర్చుకున్నానని తెలిపారు. కోనరావుపేట ఎంపీడీవో శంకర్రెడ్డి, కరీంనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయికుమార్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరిపురం కృష్ణ, ప్రధాన అర్చకుడు హనుమంత్ పంతులు, నాట్యాచార్యులు భోగ ధర్మరాజు, వసంత పాల్గొన్నారు.
స్వర్ణకారుల వృత్తిని కాపాడాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెల్లరీ దుకాణం అనుమతులు రద్దు చేసే దాకా ఉద్యమిస్తామని స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాల య్య పేర్కొన్నారు. ముస్తాబాద్లో స్వర్ణకారు ల రిలేదీక్షలు శనివారం కొనసాగాయి. దీక్షలకు బీజేపీ నాయకులు సంఘీభావం పలికారు. వారు మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో జ్యువెల్లరీ దుకాణాలు పెట్టడంతో స్థానిక స్వర్ణకారులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల సంఘం నాయకులు వెంగళం శ్రీను, చింతోజు శ్రీను, భాస్కర్, బ్రహ్మం, వెంకటేశం, అనిల్, రవి, రాజు, శ్రీనివాస్, సతీశ్ పాల్గొన్నారు.

న్యాయమూర్తులకు అభినందనల వెల్లువ

న్యాయమూర్తులకు అభినందనల వెల్లువ

న్యాయమూర్తులకు అభినందనల వెల్లువ