
ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేయాలి
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయాలని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. లారీలు, హమాలీ సమస్య లేదన్నారు. ధాన్యం తరలించడానికి సరిపడా వాహనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సీసీ పద్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వనిత పాల్గొన్నారు.
ధరణిలోని రికార్డులు భూభారతిలో..
ధరణిలో ఉన్న భూరికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ రైతువేదికలో భూభారతి ఆర్వోఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతితో రైతుల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పరిపాలన అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాధాబాయి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు యాదగిరి, గుండం నర్సయ్య పాల్గొన్నారు.
మలేరియా నిర్మూలనలో భాగస్వాములు కావాలి
జిల్లాలో మలేరియాను సమూలంగా నిర్మూలించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. మలేరియా నిర్మూలనపై ఎల్లారెడ్డిపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ సయిరా అంజుమ్ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్కుమార్ ఝా