రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌

Apr 25 2025 1:14 AM | Updated on Apr 25 2025 1:14 AM

రేపటి

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌

సిరిసిల్లటౌన్‌: అమేచ్యూర్‌ వుషూ అసోసియేషన్‌, జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌ వద్ద ఈనెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి వుషూ పోటీలు జరగనున్నాయి. 3వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సబ్‌–జూనియర్‌– జూనియర్‌ వుషూ చాంపియన్‌షిప్‌, 2వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సీనియర్‌ వుషూ చాంపియన్‌షి నిర్వహించనున్నట్లు వివరించారు. వివరాలకు 94940 73930లో సంప్రదించాలని కోరారు.

కులవృత్తులను కాపాడండి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కార్పొరేట్‌ నుంచి కులవృత్తులను రక్షించాలని కోరుతూ ముస్తాబాద్‌లో స్వర్ణకారులు గురువారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ముస్తాబాద్‌ గ్రామపంచాయతీ ఎదుట స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య గురువారం దీక్షలను ప్రారంభించారు. బాలయ్య మాట్లాడుతూ ముస్తాబాద్‌లో రాజస్థాన్‌ జ్యువెలరీ దుకాణా లకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. జ్యువెల్లరీ దుకాణ యజమానులు ఇప్పటికే పలు పట్టణాల్లో మోసాలకు పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న స్వర్ణకారుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో ప్రారంభించే జ్యువెల్లరీ దుకాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, బీజేపీ మండ ల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్‌ వీరి దీక్షలకు సంఘీభావం తెలిపారు. స్వర్ణకారుల సంఘం నాయకులు నారోజు రాజు, శ్రీనివాస్‌, వెగ్గలం శ్రీను, రాజు, చేపూరి బ్రహ్మం, నాగరాజు, సతీశ్‌, శంకర్‌, రఘు, అనిల్‌, ఈశ్వరయ్య, వెంకటేశం, రవి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరి జగన్మోహన్‌రెడ్డి కోరారు. మండలంలోని దుమాల, అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండాల్లో గురువారం నిర్వహించిన జై భీమ్‌.. జై బాపు, జై సంవిధాన్‌ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీవ్‌ యువశక్తి పథకాన్ని యువకులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సన్నబియ్యం పథకంపై గ్రామాల్లో అందరికీ పూర్తిస్థాయిలో అవగాహన లేదని, దీనిపై ప్రచారం చేయాలన్నారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఎస్‌కే గౌస్‌, శ్రీనివాస్‌, బాలయ్య, గణపతి, బుచ్చాగౌడ్‌, బండారి బాల్‌రెడ్డి, కదిరే శ్రీనివాస్‌, రవి, మధు, కిషన్‌, బాలాగౌడ్‌ పాల్గొన్నారు.

29న సదరం శిబిరం

సిరిసిల్లకల్చరల్‌: దివ్యాంగుల వైకల్య నిర్ధారణ కోసం ఈనెల 29న సదరం శిబిరం నిర్వహించనున్నట్లు ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. అవసరం ఉన్న వారు తమ వివరాలను తప్పుల్లేకుండా పొందుపరిచి మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు. కంటిచూపు, మానసిక వైకల్యం గల వారు సంబంధిత మెడికల్‌ డాక్యుమెంట్లు, ఎక్స్‌రే తదితర సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

చిన్నారులకు టీకాలు వేయించాలి

డీఎంహెచ్‌వో రజిత

కోనరావుపేట(వేములవాడ): ఈనెల 21 నుంచి అమలు చేస్తున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో చిన్నారులకు టీకాలు వేయించాలని జిల్లా వైద్యాధికారి రజిత సూ చించారు. మండలంలోని పీహెచ్‌సీ పరిధిలోని నిజామాబాద్‌, ధర్మారం, కొండాపూర్‌(నిమ్మపల్లి) ఆరోగ్య ఉపకేంద్రాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల శిబిరాలను గురువారం తనిఖీ చేశారు. కోనరావుపేట పీహెచ్‌సీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అంజలి, డీఐవో సంపత్‌కుమార్‌, ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌
1
1/2

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌
2
2/2

రేపటి నుంచి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ వుషూ చాంపియన్‌షిప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement