
ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తెలిపారు. మంగళవారం ఉదయం 4 పరీక్షా కేంద్రాల్లో 954 మంది విద్యార్థులకు 865 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 కేంద్రాల్లో 114 విద్యార్థులకు 102 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
ధాన్యాన్ని గోదాంలకు తరలించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే గోదాంలకు తరలించాలని డీఆర్డీవో శేషాద్రి కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని రాచర్లబొప్పాపూర్లో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేసి గోదాంలకు తరలించాలన్నారు. లారీల సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. రైతులకు కేంద్రాల్లో నీడ, నీటి సౌకర్యం కల్పించాలని, గన్నీసంచుల కొరత లేకుండా చూడాలని, టారాల్పిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్ఐ శ్రావణ్, సివిల్ సప్లయ్ అధికారి సందీప్, ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీలు దేవేందర్, సుధాకర్, పద్మ, వీవోఏ రేణుక ఉన్నారు.