రేషన్‌ బియ్యం లారీ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

Jun 7 2025 1:08 AM | Updated on Jun 7 2025 1:08 AM

రేషన్

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

నాగులుప్పలపాడు: అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీని ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు పట్టుకున్నారు. ఆ శాఖ డీటీ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. చీరాల వైపు నుంచి ఒంగోలు వైపునకు గురువారం అర్ధరాత్రి లారీలో రేషన్‌ బియ్యం తరలిస్తున్న విషయాన్ని పసిగట్టి చదలవాడ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీలో సుమారు 300 బస్తాల వరకు రేషన్‌ బియ్యం ఉండవచ్చని అంచనా వేశారు. అనంతరం లారీని, డ్రైవరును నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు డీటీ తెలిపారు. ఈ దాడిలో ఎఫ్‌ఐ గుణ వంశీ, సిబ్బంది పాల్గొన్నారు.

మద్దిపాడులో...

మద్దిపాడు: స్థానిక శ్రీ వెంకటేశ్వర రైస్‌మిల్లులో రేషన్‌ బియ్యాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు పట్టుకున్నారు. రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్న ఆదేశాల మేరకు మద్దిపాడు తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎస్‌ఐ శివరామయ్య రైస్‌మిల్లు వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ రేషన్‌ బియ్యం ఉండటంతో సీజ్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా సివిల్‌ సప్లయిస్‌ శాఖకు బియ్యం అప్పగించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ రైస్‌మిల్లులో ఉన్న బియ్యాన్ని లోడ్‌ చేయించి చూడగా, 2108 బస్తాల బియ్యం పట్టుబడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.40,05,200 ఉంటుందన్నారు. పట్టుబడిన బియ్యాన్ని గోడౌన్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్‌ఓ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఐ వంశీ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత 1
1/1

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement