బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:14 AM

సింగరాయకొండ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాకలకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పాండూరి ప్రదీప్‌కుమార్‌ అలియాస్‌ సన్నీ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గత నెలలో పాకిస్థాన్‌పై భారత్‌ ప్రెసిసన్‌ స్ట్రయిక్‌ చేపట్టిన తర్వాత ప్రదీప్‌కుమార్‌ సెలవుపై స్వగ్రామమైన సింగరాయకొండ మండలంలోని పాకల వచ్చారు. ఈ క్రమంలోతన తమ్ముడు అతిల్‌తో కలిసి మోటారుసైకిల్‌పై ఒంగోలుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బుధవారం పాకలలో బంధుమిత్రులు అశ్రునయనాల మధ్య ప్రదీప్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రదీప్‌కుమార్‌ భౌతికకాయానికి చిత్తూరు జిల్లా కలికిరి బీఎస్‌ఎఫ్‌–53 బెటాలియన్‌కు చెందిన 11 మంది జవాన్లు గన్‌ సెల్యూట్‌ చేసి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ప్రదీప్‌కుమార్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పాకలలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు 1
1/2

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు 2
2/2

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement