
ఫిర్యాదులపై సత్వర స్పందన
ఒంగోలు సీటీ: ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పోలీస్ అధికారులను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఎస్పీ అర్జీలు స్వీకరించారు. సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, జాబ్ మోసాలు, భూ వివాదాలు తదితర సమస్యలపైనే అధికంగా అర్జీలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణ కుమార్, సీసీఎస్ సీఐ జగదీష్, ఎస్సీ,ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం
నాగులుప్పలపాడు: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం కావడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధిత వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటన సోమవారం ఉదయం నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలులో చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. అమ్మనబ్రోలు ముస్లిం కాలనీకి చెందిన షేక్ కమ్రాన్ అనే వృద్ధురాలి పూరింట్లో విధ్యుత్ తీగలు షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి మంటలు ఆర్పేలోగా పూరిల్లు మొత్తం కాలిపోయింది. ఈ సంఘటనలో వృద్ధురాలు రెండు రోజుల క్రితం తీసుకున్న పెన్షన్ నగదుతో సహా మొత్తం రూ.50 వేల డబ్బు, దుస్తులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని బాధిత వృద్ధురాలు వేడుకుంటోంది.
ఎస్పీ ఏఆర్ దామోదర్
పోలీస్ గ్రీవెన్స్కు 79 ఫిర్యాదులు

ఫిర్యాదులపై సత్వర స్పందన

ఫిర్యాదులపై సత్వర స్పందన