డీఈవో అవినీతిపై విచారణ జరపండి | - | Sakshi
Sakshi News home page

డీఈవో అవినీతిపై విచారణ జరపండి

Jun 4 2025 12:33 AM | Updated on Jun 4 2025 12:33 AM

డీఈవో అవినీతిపై విచారణ జరపండి

డీఈవో అవినీతిపై విచారణ జరపండి

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులతో కు మ్మక్కైన డీఈవో అక్రమ హెచ్‌ఆర్‌ఏల్లో భాగస్వా మ్యం కలిగి ఉన్నారని, అక్రమంగా ఫైనాన్స్‌, చిట్టీల దందా సాగిస్తున్నారని విద్యార్థి, యువజన సంఘా ల నేతలు ఆరోపించారు. కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. డీఈవోను సస్పెండ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. అవినీతి, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్‌ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయ శిక్షణ శిబిరాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగింద న్నారు. సమగ్రశిక్షా నిధుల్లో జిల్లా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ గా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కంప్యూటర్స్‌ కొనుగోళ్లలోనూ నిధుల దుర్వినియోగం జరిగితే ఏడాది క్రితమే డీఈవోకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, దానిని తొక్కిపెట్టారని తెలిపారు. ఆ నివేదికపై చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలియజేయాలని అన్నారు. నిబంధనల ప్రకారం ఒకే జి ల్లాలో మూడేళ్లకే బదిలీ అనివార్యమైనా ఐదేళ్లుగా పె ద్దపల్లిలో కొనసాగుతుండడం అనుమానాలకు తా విస్తోందని పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సిలివేరు మధు, గూడెపు జనార్దన్‌రెడ్డి, రాజాం మహంతకృష్ణ, రామగిరి మహేందర్‌, జంగా కిరణ్‌రెడ్డి, పంజాల రవీందర్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, కొమ్మ ఐలయ్య, ఐలయ్య, దాడి రవీందర్‌, రాజేంద ర్‌, రాజయ్య, అశోక్‌గౌడ్‌, కనకయ్య, శ్రీనివాస్‌, ఎల్లేశ్‌గౌడ్‌, అనిల్‌, సాగర్‌తోపాటు ప్రజా, రైతు, విద్యా ర్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement