
రూ.15 వేలు డిమాండ్ చేశారు
మాది రాయికల్ మండలం సింగరావుపేట. 1.025 ఎకరాల భూమిని జగిత్యాలకు చెందిన ఉస్మాన్కు అమ్మాను. నా సర్వే నంబరులో ఎక్కువ భూమి ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.15 వేలకు బేరం కుదుర్చుకుని రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు.
– గాజర్ల రవి, బాధితుడు
లంచం అడిగితే ఏసీబీని సంప్రదించండి
ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064 లేదా 94404 46106 నంబర్లను సంప్రదించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అవినీతి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ

రూ.15 వేలు డిమాండ్ చేశారు