
బాలికలదే హవా
● పదో తరగతిలో 96.89శాతం ఉత్తీర్ణత నమోదు ● రాష్ట్రస్థాయిలో జిల్లాకు 10వ స్థానం ● కేజీబీవీ, మైనార్టీ, రెసిడెన్షియల్ స్కూళ్ల సత్తా ● 45 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్ ● 2024తో పోల్చితే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత ● జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, పెద్దపల్లి: పదో తరగతి వార్షిక పరీక్షలో జిల్లా విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలు సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే.. ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. అయితే, రాష్ట్రస్థాయిలో గతేడాది 8వ స్థానంలో ఉన్న జిల్లా.. ఈఏడాది 10వ స్థానానికి పడిపోయింది. ఎప్పటిలాగే ఫలితాల్లో బాలికల హవా కనిపించింది, గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,387మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 7,157 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 96.11శాతం కాగా, బాలికలు 97.67శాతం నమోదు చేసి.. బాలుర కన్నా బాలికలు ముందు వరుసలో నిలిచారు.
45 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత..
జిల్లాలోని 103 ప్రభుత్వ పాఠశాలల్లో 45 పా ఠశాలలు పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఏ ఒక్క పాఠశాలలోనూ జీరో ఉత్తీర్ణత నమోదుకాలేదు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల తరఫున పరిశీలిస్తే.. నిట్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కె.నిత్యామీనన్ 584 మార్కులు సాధించగా, కేజీబీవీ నుంచి 580 మార్కులతో సిరిపురం శ్రీజ, ఎస్.వర్షిత అత్యధిక మార్కులు సాధించారు. నందీమేడారం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి నవిత 568 మార్కులతో టాపర్గా నిలవగా, అంతర్గాం మోడల్ స్కూల్ విద్యార్థిని పిట్టల శ్రీవల్లి 569, మైనార్టీ రెసిడెన్షియల్ నుంచి విశ్వశ్రీ 586 మార్కులు సాధించారు.
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ..
రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 15రోజుల్లోగా ట్రెజరీ చలానా తీసుకుని హాల్టికెట్లు జతచేసి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంత కం చేయించి జిల్లా విద్యాశాఖ అధికారి కా ర్యాలయ పరీక్షల విభాగంలో సమర్పించా లని అధికారులు సూచించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజును మే 16 లోగా, అపరాధ రుసుంతో మే 18వ తేదీ వరకు చెల్లించే వీలుందని అధికారులు వివరించారు.

బాలికలదే హవా