
నర్సింగ్ విద్యార్థులకు నివాళి
కోల్సిటీ(రామగుండం): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని రామగుండం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పల్లె సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన నర్సింగ్ విద్యార్థినులు మహేశ్వరి, మనీషశ్రీ చిత్రపటాలకు గోదావరిఖని శారదానగర్లోని నర్సింగ్ కాలేజీలో బుధవారం పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. నర్సింగ్ కాలేజీ నుంచి హాస్టల్కు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న విద్యార్ధినులను వాహనం ఢీకొనగా ఇద్దరూ మృతి చెందారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ లు స్వాతి, ప్రియాంక, సంధ్య, భావన, ఉషా, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.