
షాపింగ్ కాంప్లెక్స్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని పోచమ్మగుడి సమీపంలోని ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ను శుక్రవారం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్కుమార్తో కలిసి రామగుండం ఎమ్మెల్యే మ క్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పరిశీలించారు. గత పాలకుల ప్రణాళిక లోపం, నిర్లక్ష్యంతో కమీషన్లకు కక్కుర్తిపడి అస్తవ్యస్తంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని మక్కాన్సింగ్ ఆరోపించారు. రూ.వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపా రు. కాంప్లెక్స్ను వ్యాపారులకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి డిజైన్లో మార్పులు చేయాల్సిన అ వసరం ఉందని ఆయన వెల్లడించారు. అందుకు అ వసరమైన చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మక్కాన్సింగ్ పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకొస్తామని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తాఫా, నాయకులు పాల్గొన్నారు.
డిజైన్లో మార్చులు చేయాల్సిందే
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్