
అవగాహన కల్పిస్తున్న ట్రెయినర్లు
పెద్దపల్లిరూరల్: పట్టణంలోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం టాస్క్ ఆధ్వర్యంలో ‘ఎంప్లాయిబిలిటీ స్కిల్స్’ అంశంపై మూడు రోజుల శిక్షణ తరగతులను టాస్క్ రీజినల్ మేనేజర్ గంగా ప్రసాద్, కళాశాల చైర్మన్ ఎడవల్లి నవీన్ సోమవారం ప్రారంభించారు. మహేంద్రప్రెడ్ ట్రెయినర్ అమూల్య విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే ప్రతిభా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో పవన్కుమార్, ప్లేస్మెంట్ అధికారి వెంకటేశ్వర్లుతో పాటు హెచ్వోడీలు తదితరులు పాల్గొన్నారు.