
మాట్లాడుతున్న దళిత ఐక్యవేదిక నేత బాపయ్య
● కేసీఆర్ది కుటుంబ పాలన.. వివేక్ది కాదా? ● దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బాపయ్య
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ను అమ్మకానికి పెట్టారా? అని దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్లు మామిడిపల్లి బాపయ్య, కోటగిరి పాపయ్య ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నదేమిటన్నారు? టికెట్ల కేటాయింపులో సామాజిక కూర్పు ఎక్కడుందని నిలదీశారు. మా దిగ ఓటర్లను పరిగణనలోకి తీసుకోకుండా, పార్టీ కోసం శ్రమించే వారిని కాకుండా, పార్టీలు మార్చే వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే వివేక్, వినోద్ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, ఎంపీ టికెట్ కూడా వారి కుటుంబానికి ఇస్తామంటే ఎవరూ ఊరుకోరన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయిస్తే వారిని గెలిపిస్తామని, లేకుంటే దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని పోటీలో నిలుపుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకనపల్లి లక్ష్మణ్, పల్లె సదానందం తదితరులు పాల్గొన్నారు.