
గదులు ప్రారంభిస్తున్న జీఎం సూర్యనారాయణ
గోదావరిఖని(రామగుండం): వీటీసీ శిక్షణను సద్వినియోగం చేసుకుని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. గురువారం ఆర్జీ–2 వీటీసీలో నూతన తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నూతనంగా చేరే యువ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో వీటీసీ అగ్రభాగాన నిలిచిందన్నారు. యంత్రాలపై పనులు చేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అనుభవజ్ఞులైన ఫాకల్టీ చెప్పిన సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగుల సౌలభ్యం కోసం రూ.16లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులు నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రెటరీ జిగురు రవీందర్, ఎస్ఓటూ జీఎం అబ్దుల్సలీం, డీజీఎం రాజేంద్రప్రసాద్, సివిల్ డీజీఎం ధనుంజయ, వీటీసీ మేనేజర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.