నేత్ర సేకరణపై శిక్షణ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

నేత్ర సేకరణపై శిక్షణ ఇప్పించండి

Nov 6 2023 1:00 AM | Updated on Nov 6 2023 1:00 AM

పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫౌండేషన్‌ ప్రతినిధులు - Sakshi

పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫౌండేషన్‌ ప్రతినిధులు

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని కొంత మంది సిబ్బందికి నేత్ర సేకరణపై శిక్షణ ఇప్పించాలని కోరుతూ సదాశయ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఆదివారం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి వచ్చిన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుజాతకు వినతిపత్రం అందజేశారు. గత 15 ఏళ్ల నుంచి సదాశయ ఫౌండేషన్‌ నేత్ర, శరీర, అవయవదానాలపై కృషిచేస్తున్న సందర్భంగా నేత్రదాతల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేత్ర సేకరణ చేసే వారు లేక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని సిబ్బందికి నేత్ర సేకరణపై శిక్షణ ఇవ్వడంతో అందుబాటులో ఉండి నేత్ర సేకరణ తీసుకోవడం సులభతరం అవుతుందని వారు వివరించారు. దీనిపై డాక్టర్‌ సుజాత సానుకులంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఏసీఎంవో డాక్టర్‌ కిరణ్‌రాజ్‌, డాక్టర్‌ సునీల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement