పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి..

Jun 1 2025 1:02 AM | Updated on Jun 1 2025 1:02 AM

పెట్టుబడి ఖర్చులు  పెరుగుతున్నాయి..

పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి..

ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. రైతులకు ఆ మేరకు మద్దతు దొరకడం లేదు. సాగుసాయం అందడంలేదు. ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తూ వరికి క్వింటాకు కేవలం రూ.69 పెంచింది. ఈ మాత్రానికే భారీగా పెంచామనడం సమంజసం కాదు. ఇది ఏ మాత్రం సరిపోదు. క్వింటా ధాన్యాన్ని రూ.3 వేలు చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వలే బోనస్‌గా రూ.500 ప్రకటించాలి. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో రైతులు పంటలను కోల్పోయారు. నిబంధనల పేరుతో పరిహారం కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం.

– బుడితి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

నిర్లక్ష్యం తగదు

తోటపల్లి ఆధునికీకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మ వలస మండలాల్లోని సుమారు 30 గ్రామాల పరిధిలోని తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కాలువల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టడం, సిల్ట్‌ తీయకపోవడం వల్ల శివారు భూములకు సాగునీరు సరఫరా కావడం లేదు. ఇటీవల బడ్జెట్లో విడుదల చేసిన నిధులు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోవు. ఈ ఏడాది ఇంతవరకు కాలువల పనులే ప్రారంభించలేదు. అంటే ఈ ఏడాది కూడా నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

– ఎం.కృష్ణమూర్తి, రైతు

సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement