● ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్ల ఆత్మహత్యాయత్నం ● రాజకీయ కక్షతో వేధింపులు తగవు ● పుర్రేయవలస సబ్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

● ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్ల ఆత్మహత్యాయత్నం ● రాజకీయ కక్షతో వేధింపులు తగవు ● పుర్రేయవలస సబ్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Apr 29 2025 9:27 AM | Updated on Apr 29 2025 9:27 AM

● ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్ల ఆత్మహత్

● ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్ల ఆత్మహత్

చెక్‌డ్యామ్‌ స్థల పరిశీలన

కొమరాడ: మండలంలోని చినఖేర్జిల పంచా యతీ బట్టమాగువలస గ్రామంలోని వనకబడి గెడ్డ వాగుపై నిర్మించనున్న చెక్‌ డ్యామ్‌ స్థలాన్ని కలెక్టర్‌ ఏ.శ్యామప్రసాద్‌ సోమవారం పరిశీలించారు. బోయిలబండ, కనపల, పెద్ద చెరువుల ను అనుసంధానించే ప్రతిపాదిత చెక్‌ డ్యామ్‌ తో కూడిన లింకేజీ వ్యవస్థపై నీటిపారదల ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నా రు. సాగునీటి వనరుల అనుసంధానంతో సుమారు 410 ఎకరాలకు ఆయకట్టకు సాగునీ రు అందుతుందన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం నీటి పారుదల శాఖ డివిజనల్‌ కార్య నిర్వాహక ఇంజినీర్‌ ఆర్‌.అప్పలనాయుడు, డ్మాఆ పీడీ కె.రామచంద్రరావు, అధికారులు పాల్గొన్నారు.

నియామక పత్రాలు అందజేత

విజయనగరం రూరల్‌: మండల పరిషత్‌ కార్యాలయాల్లో పరిపాలన అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులుగా విధులు నిర్వహిస్తూ, ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తన చాంబర్‌ లో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జి.వెంకటరావుకు ఇదే మండలంలో ఎంపీడీఓగా నియమించారు. సీతానగ రం మండల పరిషత్‌ ఏవోగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌ పాచిపెంట ఎంపీడీఓగా, గుమ్మలక్ష్మీపురం విస్తరణ అధికారి కె.ధర్మారావు జియ్యమ్మవలస ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఉద్యోగాల నుంచి తొలగిస్తే....

ఆత్మహత్యలే శరణ్యం

చీపురుపల్లి: ఏడాదిగా విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్లను తొలగిస్తే ఊరుకునేది లేదు.. ఉద్యోగాలు వస్తాయనే సబ్‌స్టేషన్‌కు భూములిచ్చాం.. ఉద్యోగాల నుంచి తొలగించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నదెవరో ఇక్కడకు రమ్మని చెప్పండి.. విధుల నుంచి తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమంటూ మండలంలోని పుర్రేయవలస గ్రామ పరిసరాల్లోని 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రంలో పని చేస్తున్న నలుగురు షిఫ్ట్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆపరేటర్లను తొలగించేందుకు వచ్చిన ఏపీఈపీడీసీఎల్‌ ఏడీఈ రమణ, ఏఈ ప్రభాకర్‌లను వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు నిలదీశారు. ఇంతలో షిఫ్ట్‌ ఆపరేటర్లు మీసాల బాలాజీ, సమిసెట్టి సురేష్‌కుమార్‌, రెడ్డి సతీష్‌, పల్లి సూర్యనారాయణలు పురుగు మందు డబ్బాలు తీసి ఆత్మహత్యకు సిద్ధంకావడంతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలొంది. సాయిమణికంట ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్స్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని, ఇప్పుడు తొలగిస్తామంటే చావుతప్ప మరో మార్గంలేదన్నారు. వేతన సమస్య కూడా కార్మికశాఖ అధికారుల సమక్షంలో పరిష్కారమైందన్నారు. ఏడాదిగా ఈపీఎఫ్‌ కూడా చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులు దృష్టికి తీసుకెళ్లామని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement