
మాచర్ల నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షు లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురిని మాచర్ల నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యా లయం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందీ. ఈ మేరకు పాముల సంపూర్ణమ్మను మహిళా విభాగ అధ్యక్షురాలిగాను, కందుకుర్తి మధును ఎస్సీ సెల్అధ్యక్షులుగా నియమితులయ్యారు.
ఏపీఐఐసీ భూముల పరిశీలన
మాచర్ల రూరల్: మండలంలోని రాయవరం గ్రామ సమీపంలోని ఏపీఐఐసీకి చెందిన భూములను తైవాన్ దేశానికి చెందిన ఏషియా కంపెనీ పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. లెదర్ పార్కు ఏర్పాటు కోసం గురువారం వారు ఆయా భూముల గురించి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుకూలత, నీటి వసతి, విద్యుత్, భూగర్భ జలాలు, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాలను వారు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ బి. కిరణ్ కుమార్తో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఇండస్ట్రియల్ అధికారులు పాల్గొన్నారు.
నేడు సత్తెనపల్లిలో సీఐటీయూ మహాసభ
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహా సభ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గల పుతుంబాక వెంకటపతి భవన్ నందు శుక్రవారం నిర్వహించడం జరుగుతుందని వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీ సాహెబ్ గురువారం తెలిపారు. వీఆర్ఏల 4వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారన్నారు. ముఖ్యంగా ఈ 4వ రాష్ట్ర మహాసభలలో వీఆర్ఏల సమస్యల పట్ల చర్చ, భవిష్యత్తు కార్యాచరణ, నూతన కార్యవర్గం తదితర అంశాల మీద చర్చ జరుగుతుందన్నారు. ఈ మహా సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వం, డివిజన్ నాయకులు పాల్గొంటారన్నారు.
అదుపు తప్పిన రెండు కార్లు
కారంచేడు: దగ్గుబాడు నుంచి చీరాలకు తన కారులో ప్రయాణిస్తున్న వీరగంధం రామకృష్ణ అనే వ్యక్తి నాలుగురోడ్ల సెంటర్ దాటి మామిడి తోట సమీపంలోకిగా రాగనే గాడిలో టైర్లు పడటంతో కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్ ఉన్న పంట కాలువలో పడిపోయింది. బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మధ్యాహ్నం పోతినవారిపాలేనికి చెందిన ఎనికపాటి మస్తాన్రావు చీరాలకు వెళ్తుండగా పోతినవారిపాలెం గ్రామం దాటిన ఒక కిలోమీటరు దూరంలోనే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీంతో ఆయన కారులోను బెలూన్లు ఓపెన్ అయ్యాయి. ఆయన కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు.