‘గ్రీన్‌లైట్‌ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌లైట్‌ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ

Jun 2 2025 2:01 AM | Updated on Jun 2 2025 2:01 AM

‘గ్రీన్‌లైట్‌ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ

‘గ్రీన్‌లైట్‌ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ

అద్దంకి రూరల్‌: వడలి రాధాకృష్ణ (చీరాల) రచించిన కథా సంపుటి ‘గ్రీన్‌ లైట్‌ ఏరియా’ ఆవిష్కరణ ఆదివారం రాత్రి స్థానిక కమఠేశ్వరస్వామి ఆలయంలో సృజన, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించి తొలి ప్రతిని చెన్నుపాటి రామాంజనేయులుకు అందజేశారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అధ్యక్షత వహించారు. కథా రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి మాట్లాడుతూ రాధాకృష్ణ కథలు ప్రత్యేకమైన శైలిలో సమాజంలోని సమస్యల పరిష్కారం దిశగా సాగుతాయని తెలిపారు. అనంతరం ఇటీవల ఉగాది పురస్కారం పొందిన వడవల్లి రాధాకృష్ణ, ఎన్టీఆర్‌ జాతీయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న నాగనేని రామకృష్ణ, ఎన్టీఆర్‌ పురస్కారాన్ని అందుకున్న మన్నం త్రిమూర్తులు, పెద్దినేని సురేంద్రబాబు, రక్తదాన ప్రోత్సాహకులు చుండూరి మురళీ సుధాకర్‌లను సృజన, రోటరీ క్లబ్‌ సభ్యులు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, వీరవల్లి రుద్రయ్య, కోట అంజమ్మ, కొల్లా భువనేశ్వరి, జ్యోతి చంద్రమౌళి, కృష్ణమోహన్‌, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, షేక్‌ మస్తాన్‌, రావూరి రంగయ్య, లెవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement