ముప్పుతిప్పల ‘స్లాట్‌’ | - | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పల ‘స్లాట్‌’

Apr 28 2025 1:01 AM | Updated on Apr 28 2025 1:01 AM

ముప్పుతిప్పల ‘స్లాట్‌’

ముప్పుతిప్పల ‘స్లాట్‌’

రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన కొత్త స్లాట్‌ విధానంతో ప్రజలకు ముప్పు తిప్పలు తప్పడం లేదు. అటు అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. రోజుకు పరిమితంగా రిజిస్ట్రేషన్లు జరగడం, నిర్దేశిత సమయానికి ఇరుపార్టీల వారు కచ్చితంగా రావాల్సి ఉండటం, ఏ చిన్న తప్పు సరిచేసుకోవాలన్నా మళ్లీ చలానా కట్టాల్సి రావడం వంటి ఇబ్బందులు ఉంటున్నాయి.

గురజాల : గురజాలలో స్లాట్‌ విధానం అమలైన తొలిరోజు శనివారం ఒక దస్తావేజును బుకింగ్‌ చేశారు. ఆ సమయంలో సర్వే నెంబరు తప్పుగా నమోదైంది. సీఎస్‌ నెంబరు తీసుకుని ఇరు పార్టీల వారు వచ్చారు. ఆ సమయంలో సర్వే నెంబరు చూసుకోవడంతో కట్టిన చలానా రద్దు అయింది. మళ్లీ చలానా మరొకటి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వచ్చింది. అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నూతన విధానాన్ని శనివారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ విధానంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వలన సమయం ఆదా అవుతుందని సకాలంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. సమయం ఆదా సంగతి పక్కన పెడితే ఇరు పార్టీల వారు ఒకేసారి అందుబాటులోకి రావాలి. ఏ ఒక్కరూ పది నిమిషాలు ఆలస్యం అయినా రిజిస్ట్రేషన్‌ జరిగే అవకాశాలు లేవు. దస్తావేజులో ఏమైనా తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం కూడా లేదు. మళ్లీ చలానా చెల్లించాల్సిన పరిస్థితి. దీనిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆర్థికంగా తమపై భారం పడటం తప్ప ఒరిగిందేమీ లేదని వాపోతున్నారు.

ఎక్కువ రిజిస్ట్రేషన్లు అసాధ్యం

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతిలలో మొత్తం పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలోని గ్రామాల్లో ఆయా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. పాత విధానంలో ఏ సమయంలో అయినా పనులు చేసుకునేందుకు వెసులుబాటు ఉండేది. కొత్త పద్ధతి ప్రజలతోపాటు కార్యాలయ వర్గాలకు సైతం తలనొప్పిగా మారింది. కాస్త ఆలస్యమైతే స్లాటు బుకింగ్‌ రద్దు అవుతోంది. రోజుకు స్థానిక కార్యాలయంలో 39 రిజిస్ట్రేషన్‌లు, జిల్లా కేంద్రంలో 78 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేలా స్లాట్‌ విధానం ఉంది. దీని వలన ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్‌ నూతన విధానంతో కష్టాలు

నిర్ణీత సమయానికి వెళ్లకుంటే

స్లాటు రద్దే

చిన్న తప్పున్నా చలానా పరిస్థితీ అంతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement