
అలరించిన కవితా పఠనం
జయపురం: జయపురం సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో రైలులో నిర్వహించిన కవితా పఠనం ప్రయాణికులను అలరించింది. జగదల్పూర్కు చెందిన సాహిత్య పరిషత్ సభ్యులు మంగళవారం సాయంత్రం ద్విభాషా సాహిత్య సమారోహంలో పాల్గొనేందుకు రైలులో వెళ్లగా రేలారే రేలారే పాట, కవితలతో ప్రయాణికులను ఉత్సాహపరిచారు. పలువురు సభ్యులు ప్రకృతి అందాలపై కవితలు వినిపించారు. అనంతరం జగదల్పూర్ ఉత్కళ సమాజ్ సభ్యులు ద్విభాషా సాహిత్య సమారోహం జరిగింది. జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మానవ విజ్ఞాన సంస్థ అధ్యక్షులు డా.ప్రియూషరంజన్ సాహు తదితరులు పాల్గొన్నారు.