
ఉన్నత లక్ష్యాలు సాధించాలి
భువనేశ్వర్: హెచ్ఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత లక్ష్యాలు సాధించాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు. స్థానిక రాజ్ భవన్ న్యూ అభిషేక్ హాల్లో 2025 వార్షిక హైస్కూల్ సర్టిఫికేట్ (హెచ్ఎస్సీ) పరీక్షలో సత్తాచాటిన 25 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో ప్రథమ మహిళ గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి సైతం పాల్గొన్నారు. విద్యార్థులు వినయంతో నేర్చుకొని ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
గవర్నర్ హరిబాబు కంభంపాటి