
రైతులు ధాన్యం డబ్బులు చెల్లించాలి
కొరాపుట్: రాయిఘర్ ప్రాంతంలోని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు చెల్లించాలని బీజేడీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి డిమాండ్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాకీసాన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలోని సుమారు 144 మంది రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. మూడు నెలలు అయినా వారికి డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. అనంతరం బీజేడీ నేతలు నేరుగా సీఎస్వో ఆఫీస్కి వెళ్లి ధర్నా చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి మరో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రందారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజులా మజ్జి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు.