
జగన్నాథ్ ధామ్ అంటే పూరీ మాత్రమే
● రామకృష్ణ దాస్ మహాపాత్రో
భువనేశ్వర్: పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రారంభోత్సవం వివాదాస్ప దం అయింది. ఈ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడం, ఆలయంలో రాతి విగ్రహాలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటువంటి వివాదస్పద జగన్నాథ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మంది రం నుంచి స్వామి సేవాయత్ల బృందం హాజరు కావడం రచ్చ ప్రేరేపించింది. ఈ పరిస్థితిపై దైతప తి నియోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ దాస్ మహాపాత్రో శుక్రవారం స్పందించారు. పూరీలో ప్రసిద్ధ జగన్నాథ ఆలయం శ్రీమందిరంలో మినహా మరెక్కడా దారు బ్రహ్మ లేడని పేర్కొన్నారు. అలాగే జగన్నాథ్ ధామ్ అంటే పూరీని మాత్రమే సూచిస్తుందన్నారు. మరెక్కడా జగన్నాథ్ ధామ్ ఉండదని తేల్చేశారు. ఈ మేరకు అధికారిక స్థాయిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆమెకి లేఖ రాసి ఈ విషయం తెలియజేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని దిఘాలో కొత్తగా ప్రారంభించబడిన జగన్నాథ ఆలయానికి ఆహ్వానం అందిన తర్వాత తాను హాజరైనట్లు వెల్లడించారు. అక్కడ విగ్రహాల ఎత్తు రెండున్నర అడు గుల నుంచి మూడు అడుగుల మధ్య ఉందన్నారు. మమతా బెనర్జీ తన శిష్యులలో ఒకరుగా పేర్కొన్నా రు. ఆమె తనను దిఘాలో జగన్నాథ ఆలయాన్ని స్థాపించమని ఆహ్వానించింది. తిథి ప్రకారం పూజ చేయమని కోరింది. అక్కడ 3 నెలలు రాతి విగ్రహా లు ఉన్నాయి. అయితే ప్రతిష్టించబడిన విగ్రహాలు వేప చెక్కతో తయారు చేయబడినవని స్పష్టం చేశా రు. పశ్చిమ బెంగాల్లోని దిఘాలో జగన్నాథ ఆల య స్థాపన మరియు దానికి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడంపై చెలరేగిన వివాదంపట్ల సేవకుల లో మిశ్రమ స్పందనలు కలకలం రేపుతున్నాయి.