
ట్రక్కులో రూ.కోటి విలువైన గంజాయి జప్తు
భువనేశ్వర్: నగరం గుండా గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో సోమవారం ఒక ట్రక్కు లోడు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా అవుతున్న ఈ సరుకు మార్కెట్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. పుల్బణీ జిల్లా నుంచి హిమాచల్ ప్రదేశ్కు ట్రక్కులో ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఆకస్మిక దాడిలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుబడింది. గంజాయిని ట్రక్కుకు లోడ్ చేసిన ప్యాకెట్లలో రహస్యంగా చుట్టి ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో 5 క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

ట్రక్కులో రూ.కోటి విలువైన గంజాయి జప్తు