న్యాయవాదుల సంక్షేమానికి కృషి | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల సంక్షేమానికి కృషి

Published Thu, May 9 2024 9:15 AM

న్యాయవాదుల సంక్షేమానికి కృషి

ఖలీల్‌వాడి: న్యాయవా దుల అభివృద్ధి, సంక్షే మం, సమస్యల పరిస్కా రానికి నిరంతరం శ్రమిస్తానని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి జీవన్‌రెడ్డి అన్నారు. నగ రంలోని వంశీ ఇంటర్నే షనల్‌ హోటల్‌లో బుధవారం కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 41ఏ మూలంగా కోర్టుకు ఉన్న అధికారాలను పోలీసులకు ధారాదత్తం చేయడంతో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. తాను జగిత్యాలలో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేస్తున్న కాలంలోనే రాజకీయ జన్మకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు న్యాయవాద సమాజం అండదండలతోనే రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్నదని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా జ్యూడిషియల్‌ అధికార పరిధిలోనికి పాత విద్యాశాఖ కార్యాలయం చెందేవిదంగా కృషి చేస్తానని తెలిపారు. మహేష్‌గౌడ్‌, పొన్నం అశోక్‌గౌడ్‌, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎల్‌ గౌడ్‌, సాయరెడ్డి, యూనిస్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement