
రాజీమార్గంతో కేసుల పరిష్కారం
నారాయణపేట: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్సివిల్ జడ్జి, లీగల్ సర్విసెస్ కార్యదర్శి వింధ్య నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో భాగంగా నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న 6,500 కేసులను టార్గెట్ దృష్టిలో ఉంచుకొని ఎన్ని కేసులను పరిష్కరిస్తారో ఆరాదీశారు. ఈ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించాలని ఆదేశించారు. త్వరగా పెండింగ్లో ఉన్న కేసులని ఈలోక్ అదాలత్ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యాధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండాలోని అంశాలను క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులను, ఎన్ఐ యాక్ట్ పెండింగ్లో ఉన్నాయా చర్చించారు. పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క కేసు ఈ లోక్అదాలత్లు డిస్పోజల్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సమావేశంలో పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఎకరాకుసాగునీరు అందిస్తాం
మక్తల్: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈమేరకు భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి వానాకాలం పంటలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ బీమా ఫేస్ –1 కృష్ణానది నుంచి పంప్హౌస్లో మోటార్లను ప్రారంభించి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సీజన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సంగంబండ రిజర్వాయర్ దగ్గర కుడి కాల్వ నుంచి సాగునీరు అందించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామని, సంగంబండ గ్రామం దగ్గర బండ పనులు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కాల్వలు నిర్మించేందుకు నిధులు తీసుకువచ్చి రైతులకు సాగునీరందిస్తామన్నారు. కార్యక్రమలలో నీటిపారుదల శాఖ అధికారి నాగశివ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్కుమార్, వెంకటేస్, తాయప్ప, గోవిందు, రవికుమార్ అదికారులు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలమూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో భారత్ అవతరించిందని, వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సదస్సులో ఆయన మాట్లాడారు. సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాత్మకంగా నిర్ణయాలతో మోదీపాలన సాగుతుందన్నారు. ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలతో మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవ ఘనంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక గొప్ప విజయం అని, సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పర్యావరణం రక్షించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతో ఒక మొక్క నాటాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, సత్యం, కృష్ణవర్ధన్రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

రాజీమార్గంతో కేసుల పరిష్కారం